SKLM: సారవకోట మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం పైకప్పు పీల్చుబడిపోయింది. సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు శ్లాబ్ నుంచి నీరు కారి కార్యాలయంలోని ముఖ్యమైన ఫైల్స్, కంప్యూటర్లు తడిసిపోతున్నాయి. భవన మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.