కర్నూలు: నగరంలో రహదారులు, డ్రైనేజీ కాలువలు వంటి మౌలిక సదుపాయాల పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు. శనివారం ఆయన చెక్పోస్ట్ సమీపంలో నందికొట్కూరు రహదారి నుంచి నంద్యాల రహదారికి అనుసంధాన రహదారిని పరిశీలించారు.