KRNL: గోనెగండ్ల మండలం అల్వాల గ్రామంలో శనివారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో, సీఐ చంద్రబాబు నేతృత్వంలో సిబ్బంది పలు ఇళ్లను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.