ADB: అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించటం జరుగుతుందని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాత్నాల మండలంలోని దుబ్బగూడ గ్రామంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజు, మోకశి, యువకులు తదితరులున్నారు.