AKP: భూ వివాదాలపై కోటవురట్ల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదుల మేరకు చినబొడ్డేపల్లి గ్రామానికి చెందిన భూ సమస్యపై చర్చించారు. ఇరువర్గాలు ఒక అంగీకారానికి రాకపోవడంతో వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తిరుమల బాబు, ఎంపీడీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.