KNR: విద్యార్థులు ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, 10వ తరగతి విద్యార్థులకు చొప్పదండి మండల విద్యాధికారి పి. మోహన్ సూచించారు. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగబోయే పదవ తరగతి వార్షిక పరీక్షలకు మండలంలో 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు, 237 మంది బాలురు, 296 మంది బాలికలు మొత్తం, 533 రాస్తున్నారని తెలిపారు.