విమాన ప్రయాణికులకు ఇండిగో విమానయాన సంస్థ షాక్ ఇచ్చింది. పెరిగిన జెట్ ఇంధన ధరల ప్రభావంతో ఫ్యూయల్ సర్ఛార్జీని పెంచుతున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి అన్ని దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై ఈ అదనపు భారం పడనుంది. ఇప్పటికే ఎయిరిండియా సర్ఛార్జీ విధించగా, తాజాగా ఇండిగో కూడా అదే బాటలో పయనిస్తోంది. దీంతో విమాన ప్రయాణం మరింత భారం కానుంది.