VZM: గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో విజయనగరంలో శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు. కన్యాకాపరమేశ్వరి ఆలయం జంక్షన్ వద్ద గ్యాస్ బండను తలపై పెట్టుకుని ఆందోళన నిర్వహించారు. జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ.. గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.