TPT: హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో గల శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు పుష్పమాల, ఫలాలు, శాలువాతో సత్కరించారు. అనంతరం వేద పండితుల వేదాశీర్వచనాలు అందించారు. తర్వాత వేద పండితులు, విద్యార్థులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.