కర్నూలు: జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 180 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ ఇంటర్ బోర్డు అధికారి లాలప్ప ఇవాళ తెలిపారు. 16,116 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 15,936 మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.