VKB: జిల్లాలో ఎండలు రోజురోజుకూ నిప్పులు చెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావడంతో ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.