VZM: గజపతినగరంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ నిర్మాణ పనులను మంత్రి శ్రీనివాస్ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు, పీఎసీఎస్ ఛైర్మన్ బంగారు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.