GDWL: భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కళ్యాణ తలంబ్రాలను పోస్టల్ శాఖ ద్వారా బుక్ చేసుకోవచ్చని అయిజ సబ్ పోస్టు మాస్టర్ ప్రశాంత్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోస్ట్ ఆఫీసులో బుకింగ్ ప్రారంభమైంది. రూ.151కు ముత్యాల తలంబ్రాలు, రూ.450కు అంతరాలయ అర్చన తలంబ్రాలు పొందే అవకాశం ఉందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.