కృష్ణా: బాపులపాడు మండలంలో 6 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు MEO రాంబాల సింగ్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 440 మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 449 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. బాపులపాడులోని ZP హైస్కూల్, సిద్ధార్థ విద్యాలయంతో పాటు వేలేరు, వీరవల్లి, కానుమోల, ఆరుగొలనులో ఏర్పాటు చేశారు.