NRML: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య రేపు జిల్లాలో పర్యటించనున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. బాసర ఐఐఐటీలో నిర్వహించే సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలో పాల్గొని, అనంతరం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో దర్శనం చేసుకుంటారు. 15న కరీంనగర్లో జరిగే కార్యక్రమంలో పాల్గొని తిరిగి సిద్దిపేటకు బయలుదేరుతారని వారు తెలిపారు.