CTR: వికలాంగులకు, వృద్ధులకు నిత్యవసర వస్తువులను ఇంటి వద్దే అందించాలని పెద్దపంజాణి తహసీల్దార్ రామ్మూర్తి డీలర్లును ఆదేశించారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. రేషన్ డీలర్లు సమయపాలన పాటించి ప్రతినెల 1వ తేదీ నుంచి రేషన్ షాప్కి వచ్చిన వస్తువులను పంపిణీ చేయాలని అన్నారు.