KNR: రాష్ట్ర మున్నూరు కాపు సంఘం (పటేల్) మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కరీంనగర్ మంకమ్మతోటకు చెందిన పురెళ్ల సరోజ పటేల్ నియామకమయ్యారు. వేములవాడలో జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ ఆమెకు నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఈ పదవిలో ఆమె మూడేళ్ల పాటు కొనసాగుతారని ఆయన పేర్కొన్నారు.