NLG: రేపటి నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు పట్టణంలో 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈవో ధర్మనాయక్ తెలిపారు. మిర్యాలగూడ మండలం, పట్టణానికి చెందిన 2,840 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు ఆయన చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు ఎంఈవో పేర్కొన్నారు.