AP: ఏపీ పీజీసెట్-2026 దరఖాస్తులకు సంబంధించి గడువు ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించినట్లు SVU వీసీ ఆచార్య నరసింగరావు వెల్లడించారు. ఈ నెల 19 వరకు గడువును పెంచినట్లు పేర్కొన్నారు. మే 5 నుంచి 11 తేదీల్లో పరీక్షలు ఉంటాయని చెప్పారు. 30 సబ్జెక్టుల్లో వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు పీజీసెట్కు 12 వేల దరఖాస్తులు వచ్చాయని స్పష్టం చేశారు.