KKD: రాజస్థాన్ జలోర్ నుంచి మొదలు పెట్టి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రముఖ దేవాలయాలు పాదయాత్ర చేస్తున్న కేసా రామ్ పిఠాపురం చేరుకున్నారు. కేసా రామ్కు మార్వాడీ విష్ణు సమాజ్, విశ్వ హైందవ పరిషత్ నాయకులు కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. కేసా రామ్ మాట్లాడుతూ… మన దేశం సురక్షితంగా ఉండాలని పాదయాత్ర చేస్తున్నానన్నారు.