NLR: విడవలూరు మండలంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించారు. మండలంలోని పార్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును, ఓవర్ హెడ్ ట్యాంకు, డ్రైనేజీను ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.