E.G: నిడదవోలు మండలం కోరుమామిడిలో సైబర్ నేరాలు, జూదం నియంత్రణ, LHMS వ్యవస్థపై గురువారం రాత్రి అవగాహన సమావేశం నిర్వహించారు. CI పి.వి.జి తిలక్ ఆధ్వర్యంలో SI బాలాజీ సుందర్రావు గ్రామస్థులకు సైబర్ మోసాలపై జాగ్రత్తలు సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని, అలాగే ఊరు వెళ్లేటప్పుడు LHMS యాప్ వాడాలని కోరారు.