TPT: పుత్తూరు పురపాలక సంఘ కార్యాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాల ఎంపిక కోసం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు కమిషనర్ డీ.వీ. నాగేశ్వరరావు తెలిపారు. భారత ప్రభుత్వ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ సహకారంతో నిర్వహించే ఈ శిబిరంలో వీల్చైర్లు, వాకర్లు, వినికిడి యంత్రాలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలు అందజేస్తారు.