TG: రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాను ఎంపిక చేసినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ప్రాజెక్టు అమలు విధానం, ముందస్తు ఏర్పాట్లు, అవసరమైన సాంకేతిక సదుపాయాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.