NDL: మండలంలోని ముత్యాలపాడు బస్టాండ్ సమీపంలో గురువారం కారు ఆటో ఢీకొన్న సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. బాచేపల్లి నుంచి చాగలమర్రికి వస్తున్న ఆటోకు ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో బైక్ పైన వస్తున్న ఖాజావలికి కాలు విరగగా, రహంతుల్లా, మౌలాలీ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.