TPT: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తిరుపతి జిల్లాలో మొత్తం 84 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో నమోదైన 4,973 మంది విద్యార్థుల్లో 4,660 మంది పరీక్షలకు హాజరయ్యారని RIO రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మొత్తం 313 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు వెల్లడించారు.