KKD: పిఠాపురం ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా 14 ఏళ్ల వయస్సు నిండిన బాలికలకు వేశారు. టీకా ప్రారంభం కార్యక్రమంలో జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ చల్లా లక్ష్మి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా ఎంతో కీలకమని, అర్హులైన ప్రతి బాలిక టీకా వినియోగించుకోవాలన్నారు.