GDWL: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం వెళ్తున్న పాదయాత్రికులకు అలంపూర్ న్యూ ప్లాట్స్ కాలనీ మహిళలు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న భక్తుల కోసం మహిళలు చందాలు వేసుకుని సేవా కార్యక్రమం చేపట్టారు. గత మూడు రోజులుగా వందలాది మంది భక్తులకు మజ్జిగ అందిస్తూ సేవలందిస్తున్నామని నిర్వాహకులు వరలక్ష్మి, ఇస్మాయిల్ బేగం, జ్యోతి తెలిపారు.