ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడి, ఉక్కబోతలు పెరుగుతాయి. ఉపశమనానికి చాలా మంది ఏసీలను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా వర్క్ ప్లేస్లలో ఉద్యోగులైతే ఏసీ రూముల్లో గడుపుతుంటారు. కానీ అందరి శరీరతత్వం ఒకే విధంగా ఉండదు. కొందరికి ఏసీ పడకపోయినా.. ఎక్కువ సేపు ఏసీ గదిలో ఉన్నా అలర్జీలకు గురికావచ్చు. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేస్తే.. అదే ఆరోగ్య సమస్యగా మారవచ్చని నిపుణులు అంటున్నారు.