TPT: పిచ్చాటూరు, కేవీబీపురం ప్రాంతాల్లో దివ్యాంగులు, వయోవృద్ధులకు జీవన పరికరాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన నిర్ధారణ శిబిరాలకు మంచి స్పందన లభించింది. వందలాది మంది హాజరై పరీక్షలు చేయించుకొని రసీదులు పొందారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.