ATP: పామిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సోమవారం ఎంపీడీవో తేజోష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వ్యవసాయం, గృహాలు, రోడ్లు వంటి అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. సమావేశానికి ఆయా శాఖల మండల అధికారులు, సర్పంచులు హాజరు కావాలన్నారు.