ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామంలో రైతు సాధికారత ఎఫ్ఈవో ఆధ్వర్యంలో జిల్లా ఉద్యానవన శాఖ ద్వారా గురువారం రైతులకు ఉచితంగా వెజిటేబుల్ మినీ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మడవి కిషన్, ఉద్యాన విస్తరణ అధికారి శైలజ, ఎఫ్ఈవో డైరెక్టర్ ఎర్రం నర్సింగ్ రావు, సీఈవో దినేష్, పుదరి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.