JN: స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ 13వ వార్డుకు చెందిన ఆర్టీసీ కండక్టర్ రాడపాక లింగయ్య తండ్రి రాడపాక కొమురయ్య గురువారం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు దయాకర్ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.