KDP: అమరావతి రాష్ట్ర సచివాలయంలో జరిగిన 6వ జిల్లా కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పెట్టుబడులు, వైద్యం, సంక్షేమ పథకాలు, విద్య-నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చించారు. మధ్యాహ్నం శాంతి భద్రతలపై సమీక్ష జరగనుంది.