KDP: ఖాజీపేట మండలంలోని తవ్వారిపల్లె గ్రామానికి చెందిన చిట్టిబోయిన సుబ్బరాయుడు, చాలగాండ్ల సుబ్బరాయుడు, శంకర, రత్నాకరలకు చెందిన 60 గొర్రెలు ఇవాళ తెల్లవారుజామున కుక్కల దాడిలో మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన గొర్రెల విలువ లక్షల్లో ఉందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం కుక్కల బెడదను తగ్గించి, తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.