BDK: 99 రోజుల ప్రణాళికలో భాగంగా రామవరం జాతీయ రహదారిపై పోలీస్ సిబ్బంది గురువారం మానవహారం నిర్వహించారు. మత్తు పదార్థాల బారిన పడి యువత తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని కొత్తగూడెం టూ టౌన్ ప్రతాప్ సూచించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలను గురించి వివరించారు. డ్రగ్స్ గంజాయి వంటి మహమ్మారి బారిన పడకుండా ఉండాలని సూచించారు.