PDPL: ధర్మారం మండల కేంద్రంలో ఇవ్వాల నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం రెండు కేంద్రాలలో కలిపి 519 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా, 509 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు వెల్లడించారు.