ప్రకాశం: కనిగిరిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.