ADB: భోరజ్ మండలంలోని బాలాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కిచెన్ షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు, బీజేపీ నాయకులు తదితరులున్నారు.