NGKL: బల్మూర్ మండలం చెన్నారంలో ఉపాధి హామీ కూలీలతో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సమావేశమయ్యారు. కూలీలకు రోజుకు 600 రూపాయల వేతనం చెల్లించాలని, ఏటా 200 రోజుల పని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూలీల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న విబిరాంజీ బిల్లును తక్షణమే రద్దు చేయాలని నాయకులు మల్లేష్, శంకర్ నాయక్ కోరారు.