NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ రేపు చందంపేట మండలంలో పర్యటించనున్నారు. ఉదయం ముర్పునూతల, బండమీది తండాల్లో CC రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే మండల కేంద్రంలోని కేజీబీవీలో నూతన తరగతి గదులను ప్రారంభించడంతో పాటు, మానవత్ తండాలో నూతన గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు భూమిపూజ చేస్తారు.