KNR: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 27 మందిని నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో కరీంనగర్ నుంచి మాజీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావుకు చోటు దక్కింది. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన రామచందర్ రావుకు కేంద్ర మంత్రికి సునీల్ రావు కృతజ్ఞతలు తెలిపారు.