BDK: భద్రాచలం పట్టణంలో ట్రీ కటింగ్ పనుల దృష్ట్యా గురువారం ఉ. 8 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. ముత్యాలమ్మ టెంపుల్, ముదిరాజ్ బజార్, తాత గుడి సెంటర్, రంగనాయకుల గుట్ట, అంబ సత్రం, అహోబిలం మఠం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు. ఈ పనులకు వినియోగదారులు సహకరించాలని కోరారు.