NLG: మునుగోడు మండలంలోని కలవలపల్లిలో ఎండిపోయిన వరి పంటలను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టాల వివరాలను తెలుసుకున్నారు. రైతులకు న్యాయం చేయాలని, ప్రభుత్వానికి సమస్యలను తెలియజేస్తామని ఆయన హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, నాయకులు పాల్గొన్నారు.