హైదరాబాద్(Hyderabad) – సికింద్రాబాద్ నగరాల మధ్య సేవలు అందించే 22 ఎంఎంటీస్ రైళ్లను నాలుగు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ఓ ప్రకటనలో తెలిపింది. నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 14, 15 తేదీల్లో కొన్ని రైళ్లు, 14 నుండి 17 తేదీల మధ్య మరిన్ని రైళ్లు రద్దు చేసినట్లు వెల్లడించింది. 14, 15 తేదీల్లో లింగంపల్లి(Lingampally) – హైదరాబాద్ రైళ్లు, 14 వ తేదీ నుండి 17 వరకు ఉందానగర్ – లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్ నుమా(Falak Numa), రామచంద్రాపురం – ఫలక్ నుమా మార్గాల్లో రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది.
మరోవైపు అనకాపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విశాఖ నుంచి బుధవారం 5.45గంటలకు బయల్దేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (20833) ఉదయం 8.45 గంటలకు బయల్దేరింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ (Secunderabad) నుంచి బయల్దేరాల్సిన సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్ రైలు (20834).. నాలుగు గంటలు ఆలస్యంగా రాత్రి 7 గంటలకు బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.