NLG: చండూరు తస్కానిగూడెంలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో వార్డుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామ పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాంబాబు, గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు.