VZM: రైతులు ప్రతి పంటను డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదు చేసుకోవాలని రామభద్రాపురం AO ఏవో శివ సూచించారు. మంగళవారం స్దానిక తారాపురంలో రబి సీజన్ పంట నమోదు చేసుకున్న రైతుల జాబితాలను RSKలో సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు తాము సాగు చేసిన పంట వివరాలను ఇక్కడ సరిచూసుకోవాలని, ఫార్మర్ రిజిస్ట్రీలో ప్రతి రైతు తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు.