JGL: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం జూమ్ మీటింగ్ ద్వారా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. పరీక్షలపై ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో హాజరు కావాలని, పరీక్షలకు ముందు పునశ్చరణ సక్రమంగా చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు విజయాన్ని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.