ప్రకాశం: పొన్నలూరు మండలం ఉప్పలదిన్నెలలో మంగళవారం జాతీయ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కొండ్రగుంట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రైతులు కృత్రిమ ఎరువులు మానేసి సేంద్రియ ఎరువుల్ని వాడాలని సూచించారు. రసాయన మందులు వాడడం మాని కాషాయాలతో ప్రకృతి వ్యవసాయం చేయవచ్చన్నారు.