KMM: మధిరలో వంద సంవత్సరాల వయస్సు గల ప్రముఖ కవి రామిశెట్టి రోషయ్యను మంగళవారం ఆయన స్వగృహంలో సాహిత్య వేత్తలు ఘనంగా సత్కరించారు. ఇటీవల ఖమ్మంలో వెలువడిన “నూరేళ్ల అరుణ కేతనం” కవితా సంకలనంలో ఆయన రచించిన “గర్జించిన ఎర్రజెండ” కవిత ప్రచురితమైంది. వయోభారం కారణంగా కవిసమ్మేళనానికి హాజరు కాలేకపోవడంతో ప్రత్యేకంగా వెళ్లి సన్మానం చేశారు.